Monday, May 13, 2024
- Advertisement -

కొత్త సినిమా షూరు చేసిన రంగ‌మ్మాత్త‌

- Advertisement -

యాంక‌ర్ అనుసూయ రంగ‌స్థ‌లం సినిమాతో సృష్టించిన హంగామా అంత ఇంత కాదు.రంగ‌స్థ‌లం సినిమాలో రామ్ చ‌ర‌ణ్ త‌రువాత రంగ‌మాత్త క్యారెక్ట‌ర్ మాత్ర‌మే.ఈ సినిమా త‌రువాత అన‌సూయ‌కు చాలానే అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టికి,వాట‌లో మంచి వాటిని మాత్ర‌మే సెలెక్ట్ చేసుకుంటుంది అనుసూయ‌.తాజాగా అనసూయ ‘కథనం’ అనే థ్రిల్లర్ తో మరో సారి ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విజయదశమి సందర్భంగా ఈరోజే రిలీజ్ చేశారు.

ఈ మోషన్ పోస్టర్ లో అనసూయ ఏదో సీరియస్ గా రాస్తూ ఉంది. మరి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తోందో లేదా ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ స్టొరీ ని రాస్తోందో తెలియదు గానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పక్కాగా ఒక థ్రిల్లర్ స్టైల్ లోనే ఉంది. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్.. ధనరాజ్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ నాదెండ్ల ఈ సినిమాకు దర్శకుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -