Friday, April 19, 2024
- Advertisement -

సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రామ్ చరణ్!

- Advertisement -

మెగా హీరో సాయి ధ‌రమ్ తేజ్ ఈ ఏడాది సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ చిత్రంలో నటిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘రిపబ్లిక్’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో రామ్ చరణ్ విడుదల చేశాడు. ‘ప్రభుత్వం ఉందనే భ్రమల్లో మనం బతుకుతున్నాం. ప్రభుత్వం అంటే ఏమిటో మనం ఇంకా కనుక్కోవాల్సి ఉంది’ అని పోస్టర్ పై రాసి ఉంది.

చాలా రోజుల తర్వాత దేవా క‌ట్టా నుంచి వస్తున్న పక్కా పొలిటికల్ సినిమా రిప‌బ్లిక్ కాగా, ఈ సినిమా పూర్తిగా ప్ర‌జాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. పోస్టర్ చూస్తుంటే ఎంతో ఆసక్తికరంగా ఉందని.. ఈ మూవీ సబ్జెక్ట్ కూడా ప్రజల్లో ఆలోచన రేకెత్తించే విధంగా ఉండోబోతున్నట్లు అనిపిస్తుందని అన్నారు.

తన సోదరుడు సాయి ధరమ్ తేజ్, దేవా కట్ట, యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. కాగా, ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత రామ్ చరణ్ కు సాయి ధరమ్ తేజ్ ధన్యవాదాలు తెలిపాడు. పోస్టర్ ను లాంచ్ చేస్తావా? అని అడిగిన అదే క్షణంలోనే ఓకే చెప్పేస్తాడని అనుకోలేదని చెప్పాడు. ఇలాంటి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నా అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -