Saturday, April 20, 2024
- Advertisement -

కరోనా ఎఫెక్ట్ : సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ రిలీజ్ వాయిదా?

- Advertisement -

మొన్నటి వరకు థియేటర్లలో చిన్నా పెద్ద సినిమాల సందడి నెలకొంది. గత ఏడాది కరోనా వైరస్ ప్రభావంతో థియేటర్లు మూసి వేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ మినహాయించిన తర్వాత తిరిగి థియేటర్లు ఓపెన్ అయ్యాయి. దాంతో చిన్న హీరోలు, పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్ అయ్యాయి.. మరికొన్ని చిత్రాల షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. త్వరలో అవి రిలీజ్ కి సిద్దంగా ఉన్నా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో వాయిదా పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘రిపబ్లిక్’ మూవీ వాయిదా పడనున్నట్లు సమాచారం. దేవ కట్టా దర్శకత్వంలో ‘రిపబ్లిక్’ సినిమా చేశాడు. ఇది పొలిటికల్ డ్రామాగా రూపొందింది. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు – రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషించారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అయితే ఈ మూవీ జూన్ 4వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున థియేటర్లకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా బీభత్సంగా విజృంభిస్తుంది. దాంతో పలు చిత్రాలు వాయిదా వేసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.

టాలీవుడ్‌లో విషాదం.. నిర్మాత CN రావు మృతి!

తిరుమలలోనే అంజనీపుత్రుడి జననం

నితిన్ ‘మాస్ట్రో’ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -