కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న చిరు చివరలో ప్రచారానికి దిగుతున్నారు. చిరు ప్రాచరం చేసెది జనసేన తరుపున మాత్రం కాదుండోయ్…కాంగ్రెష్ తరుపున. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న చిరు ప్రచారం చేయడం ఏంటనుకుంటున్నారా…? చిరు ప్రచారం చేసేది తెలంగాణాలో.
చిరంజీవి ప్రచారం చేస్తున్నది జనసేనకు మాత్రం కాదుద.తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున ప్రచారాన్ని నిర్వహించాలని చిరు నిర్ణయించారు. ఈ విషయాన్ని తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ప్రకటించారు. మరోవైపు, చిరంజీవికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువు అన్న సంగతి తెలిసిందే. తన కోడలు ఉపాసనకు విశ్వేశ్వర్ రెడ్డి స్వయానా చిన్నాన్న అవుతారు. బంధుత్వం కారణంగా చిరు ఎన్నికల ప్రచారంలో ఒక రోజు పాల్గొంటారు.