బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధానపాత్రలో, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గంగూబాయి కతియావాడీ. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ముంబైలోని రెడ్ లైట్ ఏరియా నుంచి వచ్చిన ఒక మహిళ (గంగూబాయి) ఎలా ఒక డాన్ గా మారిందనేది కథాంశం.
గంగూబాయి కతియావాడీ సినిమాపై గంగూబాయి తనయుడు బాబూ రావుజీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తల్లిని చిత్రంలో ఒక వేశ్యగా చూపించారని ఆయన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై కోర్టులో పరువు నష్టం వేశాడు. సినిమా విడుదలపై స్టే విధించాలని కోర్టును కోరాడు.
ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబూ రావుజీ మాట్లాడుతూ.. సినిమా కోసం నా తల్లిని వేశ్యగా మార్చారని అన్నాడు. మీ అమ్మ వేశ్యనా అని ఎంతో మంది తనను ప్రశ్నిస్తున్నారని చెప్పాడు. సామాజిక కార్యకర్త అయిన తన అమ్మ గంగూబాయిని చిత్ర యూనిట్ అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుంటుబం కొంతకాలంగా ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నదని చెప్పాడు.