ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్రావు వ్యాఖ్యలు
ఒక మంత్రి కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమెతో సంబంధాలు ఉన్నాయని.. వారిద్దరూ లవ్లో ఉన్నారని సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు వస్తున్నాయి. అసలు తన కొడుకుకు ఆ హీరోయిన్కు మధ్య ఎలాంటి సంబంధాలు లేవని స్వయంగా ఆ మంత్రి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్ రావు కుమారుడు రవితేజ. రవితేజ సినిమా హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక సినిమాలతో కూడా నటించాడు. అయితే ఈ సమయంలో గంటా రవితేజతో హీరోయిన్ సాయిపల్లవి మధ్య లవ్ ఎపిసోడ్ నడుస్తోందని ప్రచారం కొనసాగింది. దీనికి సోషల్మీడియా వేదికగా నిలిచింది.
ఈ ప్రచారంపై గంటా శ్రీనివాస్ రావు స్పందించి ఈ ప్రచారం తప్పు అని.. అది దుష్ప్రచారం అని స్పష్టం చేశారు. రవితేజ, సాయిపల్లవి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి విషయాలపై సాధారణంగా స్పందించనన్నారు. అవాస్తవమైన విషయాలను నిరాధారమైన ఆరోపణలతో ప్రచారం చేయొద్దని కోరారు. ఇతరుల జీవితాలపై మచ్చ వేసేలా వార్తలు రాయడం తగదని చెప్పారు. తన కుమారుడికి వివాహం అయ్యిందని విషయాన్ని ప్రచారం చేసేవాళ్లు మరచిపోయారని తెలిపారు.
మంత్రి గంటా శ్రీనివాస్రావు కుమారుడు రవితేజ ఇటీవల ‘జయదేవ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరికొన్ని సినిమాలతో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలో ఇలాంటి పుకార్లు రావడంపై మంత్రి గంటా శ్రీనివాస్రావు బాధ వ్యక్తం చేశారు.