Monday, April 29, 2024
- Advertisement -

గోపిచంద్..భీమా రన్‌టైం లాక్

- Advertisement -

హర్ష దర్శకత్వంలో మాచో స్టార్ గోపిచంద్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించగా గోపిచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు ఏ సర్టిఫికేట్ ఇవ్వగా 2 గంటల 23 నిమిషాల రన్ టైం లాక్ చేశారు. రవి బస్రూర్ సంగీతం అందించగా నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముఖేష్ తివారీ, రోహిణీ కీలక పాత్రల్లో నటించారు.

గత కొంతకాలంగా హిట్ కోసం చూస్తున్న గోపిచంద్‌కు ఈ సినిమా ఎంతో కీలకం కానుంది. అందుకే భీమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు గోపిచంద్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -