Friday, May 10, 2024
- Advertisement -

ఇద్ద‌రు హీరోలు.. ఒక్క హిట్ కోసం..!

- Advertisement -

టాలీవుడ్‌కు చెందిన ఇద్ద‌రు హీరోలు ఒక్క హిట్ కోసం తెగ తాప‌త్రాయ ప‌డుతున్నారు. వారిలో ఒక‌రు మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌,రెండో హీరో గోపిచంద్‌. ఈ ఇద్ద‌రు హీరోలు గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్లు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మెగా మేనల్లుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైన సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్‌లో బాగానే ఆక‌ట్టుకున్నాడు. చిరు మేన‌రిజ‌మ్స్ చేస్తు త‌న‌కంటు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. త‌రువాత కాలంలో మాస్ ఇమేజ్ కోసం తెగ ప్ర‌య‌త్నించి చేతులు కాల్చుకున్నాడు. క‌థ‌ల‌ను కాకుండా ద‌ర్శ‌కులను న‌మ్మి తేజు ఎక్కువుగా మోసపోయాడు. దీంతో క‌మ‌ర్షియ‌ల్‌ సినిమాల‌కు దూరంగా జ‌రిగి ప్రేమ క‌థ‌ల స్పెష‌లిస్ట్ అయిన క‌రుణ‌క‌ర‌న్‌తో తేజ్ ఐ ల‌వ్ యు అనే ప్రేమ క‌థ‌తో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమాలో సాయి ధ‌ర‌మ్‌కు జంట‌గా అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాతో అయిన‌ హిట్ కొట్ట‌క‌పోతే సాయి ధ‌ర‌మ్ తేజ్‌ను ఎవ‌రు ప‌ట్టించుకోరు. ఇప్ప‌టి వ‌ర‌కు మెగా మేన‌ల్లుడిగా ఏదో ర‌కంగా సినిమాలు చేస్తు వ‌చ్చిన తేజుకు ఈ సినిమా హిట్ కీల‌కం కానుంది. తేజ్ ఐ ల‌వ్ యు సినిమా ఫ‌లితంపై సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్ ఆధార‌ప‌డి ఉంటుంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక గోపిచంద్ కెరీర్ స్టార్టింగ్‌లో హీరోగా వ‌చ్చిన త‌రువాత విల‌న్‌గా మారి కొన్ని సినిమాలు చేశాడు. మ‌ళ్లీ హీరోగా ట‌ర్న్ అయి త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకున్నాడు. మాస్ హీరోగా వ‌రస హిట్లు కొట్టాడు గోపిచంద్.త‌రువాత కాలంలో తెలుగు సినిమాల ప్రభావం వ‌ల్ల ఫ్యామిలీ,కామెడి సినిమాలు చేస్తు వ‌చ్చాడు.దీంతో గోపిచంద్ నుండి ప్రేక్ష‌కుల‌కు బోర్ కొట్టే సినిమాలు ఎక్కువైయ్యాయి. గోపిచంద్ నుండి ఆశించే సినిమాలు రాక‌పోవ‌డంతో ఇత‌ని సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. గోపిచంద్ న‌టించిన కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన సంగ‌తి కూడా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌దు అంటే ఇత‌ని ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దీంతో అత‌ను మ‌ళ్లీ క‌మ‌ర్షియ‌ల్ బాట పట్టి తీస్తున్న సినిమా పంతం. గోపిచంద్ కెరీర్‌లో పంతం 25వ సినిమా కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల అయిన ట్రైల‌ర్ టీజర్ ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమా త‌న‌కు హిట్ ఇస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు గోపిచంద్‌. పంతం సినిమా హిట్ కావడం గోపిచంద్‌కు చాలా కీల‌కం.ఎందుకంటే ఇప్ప‌టికే ద‌ర్శ‌కులు గోపిచంద్ అనే హీరో ఉన్నాడ‌ని మ‌ర్చిపోయారు. ఈ సినిమా కూడా ఫెయిల్ అయితే గోపిచంద్ వైపు ఎవ‌రు చూడ‌రు.

మ‌రి ఫ్లాప్‌ల‌లో ఉన్న ఈ ఇద్ద‌రు హీరోలు ఒకేరోజున వ‌స్తున్నారు. ఎవ‌రి సినిమాలపై వారు గట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. ట్రైల‌ర్‌,టీజ‌ర్‌ను బ‌ట్టి చూస్తుంటే సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమా కంటే గోపిచంద్ సినిమాకు కాస్తా బ‌జ్ ఎక్కువుగా క‌న‌బడుతుంది. మ‌రి ఈ రెండు సినిమాల‌లో ఏది విజ‌యం సాధిస్తుందో చూడాలి అంటే మ‌రో రెండు రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -