ఇటు టాలీవుడ్లోను అటు బాలీవుడ్లోను బయోపిక్ల హవ నడుస్తుంది.తెలుగులో ఇప్పటికే మహనటి సినిమాతో అలనాటి హీరోయిన్ సావిత్రి జీవిత కథను సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్,వైఎస్ఆర్ జీవిత కథలను సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.ఇక బాలీవుడ్లో బయోపిక్ సినిమాలకు కొదవ లేదు. ఇక ఇప్పుడు మరో బయోపిక్కు రంగం సిద్ధం అవుతుంది.
ఇండియా బ్యాంక్లను మోసం చేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ తెలకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ మాల్యా పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద పోషిస్తున్నాడని నిహ్లానీ తెలిపారు. మాల్యా పాత్రలో గోవింద గెటప్ చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతారని చెప్పారు. బ్యాంక్ స్కాం సన్నివేశాలను వినోదాత్మకంగా తెరకెక్కించామని పహ్లాజ్ నిహ్లానీ చెప్పారు.