Monday, April 29, 2024
- Advertisement -

ఫ్యాన్స్‌ని మడత పెట్టేసిన మహేష్!

- Advertisement -

దాదాపు 13 ఏళ్ళ తర్వాత త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి రేసులో 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది చిత్రయూనిట్.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా, సెకండ్ ఓ మై బేబీ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా నిన్న విడుదల చేసిన కుర్చీ మడతపెట్టే సాంగ్‌ సైతం అదరగొట్టింది. ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని ఇవాళ విడుదల చేశారు. ఈ సాంగ్ ని సాహితి చాగంటి, శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించగా రామజోగయ్య శాస్త్రి రచించారు. మంచి మాస్ బీట్స్ తో యువత, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌గా మారింది.

మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చుదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా మంచి టాక్ సొంతం చేసుకోగా హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -