Monday, April 29, 2024
- Advertisement -

క్యాన్సర్‌ను గెలవలేదు .. హంసానందిని భావోద్వేగ పోస్ట్

- Advertisement -

టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా ఇంకొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి హంసానందిని. కొన్నాళ్ల క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది. తనకు క్యాన్సర్ సోకినట్లు స్వయంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో తన భావాలను కూడా ఫాలోవర్స్‌తో పంచుకుంది.

ఇక ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న హంసా.. చాలారోజుల తర్వాత తన క్యాన్సర్ గురించి మరొక పోస్ట్ చేసింది. ’16 సైకిల్స్‌లో కీమో థెరపీ అయిపోయింది. నేను ఇప్పుడు అఫీషియల్‌గా ఒక కీమో సర్వైవర్‌ని. కానీ అప్పుడే అంతా అయిపోలేదు.

నేను ఇంకా గెలవలేదు. తరువాతి యుద్ధానికి సిద్ధం అవ్వడానికి ఇదే సమయం. ఇది సర్జరీల సమయం.’ అంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమయంలో తన ఫోటోను పోస్ట్ చేసింది. దాంతో హంసానందిని త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

రీల్ జంటలు రియల్ లైఫ్ లో ఒక్కటైన హీరో, హీరోయిన్లు..!

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

రెమ్యూన‌రేష‌న్ భారీగా పెంచేసిన ప్రియామ‌ణి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -