సంక్రాంతి రేసులో విజేతగా నిలిచింది హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం వసూళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.విడుదలైన 10 రోజుల్లోనే హనుమాన్ రూ.200 కోట్ల వసూళ్లను దాటేసింది.
తాజాగా ఈ సినిమా లేటెస్ట్ వసూళ్లు గమనిస్తే రూ.231 కోట్లు వసూలు చేసింది. అటు హిందీలో కూడా హనుమాన్ వసూళ్ల సునామీ ఆగడం లేదు. నిన్న ఒక్కరోజులోనే హిందీలో రూ.1.25 కోట్లు సాధించింది. హను మాన్ ఇప్పటివరకు హిందీలో రూ.37.79 కోట్లు రాబట్టింది.
ఇక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ హనుమాన్ రిలీజ్ కాగా ప్రతి టికెట్పై రూ.5 విరాళంగా ఇస్తామని ప్రకటించగా ఆ మాటను నిలబెట్టుకున్నారు మేకర్స్. హనుమాన్కు సీక్వెల్గా జై హనుమాన్ రానుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సీక్వెల్లో శ్రీరాముడిగా రామ్ చరణ్, ఆంజనేయస్వామిగా రానా నటిస్తున్నట్లు సమాచారం. జై హనుమాన్ 2025లో విడుదల కానుంది.