- Advertisement -
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి రేసులో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికి థియేటర్లలో సందడి చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో 300 కోట్ల క్లబ్ లో చేరింది. ఈసందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు.
ఇక విడుదలైన అన్ని భాషల్లో సత్తా చాటుతోంది హనుమాన్. బాలీవుడ్లో సైతం రూ.50 కోట్లు వసూల్ చేసింది. ఒక చిన్న సినిమా బాలీవుడ్లో 50 కోట్ల క్లబ్ లో చేరడం చిన్న విషయం కాదు.
బాలీవుడ్లో హనుమాన్ వసూళ్ల జోరు కొనసాగుతుండటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. టీజర్ లాంచ్ నుండి, గ్రాండ్ రిలీజ్ వరకూ హిందీ ఆడియెన్స్ నుండి మంచి ఆదరణ లభించిందన్నారు. హను మాన్ ఘన విజయం సాధించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.