తెలుగు దేశం మాజీ ఎంపీ,నటుడు నందమూరి హరికృష్ణ నిన్న(బుధవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.నెల్లురులోని ఓ అభిమాని ఇంట్లో జరుగుతున్న పెళ్లి కోసం వెళ్తుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.ఆయన మరణవార్త తెలియగానే అటు తెలుగు దేశం పార్టీలోను,ఇటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోను విషాద ఛాయలు అలుముకున్నాయి.హరికృష్ణకు ముగ్గురు కొడుకులు,ఓ కుమార్తె ఉన్నారు.హరికృష్ణకు రెండు వివాహాలు జరిగాయి.
మొదటి భార్య లక్ష్మీకి ముగ్గురు సంతానం కాగ,రెండో భార్య షాలినికి ఒక సంతానం ఉంది.2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కొడుకు జానికి రామ్ మరణించిన సంగతి తెలిసిందే.ఇక హరికృష్ణ రెండో కొడుకు కల్యాణ్ రామ్ హీరోగా,నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.హరికృష్ణ మూడో కొడుకు ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.హరికృష్ణ మొదట్లో ఎన్టీఆర్ తల్లి షాలినితో సహజీవనం చేశారు హరికృష్ణ .తరువాత కాలంలో ఎవరికి తెలియకుండ ఆమెను రెండో వివాహం చేసుకున్నారు.ఇద్దరి భార్యల మధ్య మాటలు ఉండేవి కావని తెలుస్తుంది. కాని హరికృష్ణ మరణ వార్త తెలియగానే ఆయన రెండో భార్య షాలిని షాక్ గురై కళ్లు తిరిగి పడిపోయారని తెలుస్తుంది.
ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని తెలుస్తుంది.హరికృష్ణ మృతదేహం ఆయన ఇంటికి చేరగానే రెండో భార్య షాలిని ఆయన ఇంటికి చేరుకుంది.భర్త మృత దేహాన్ని చూసిన ఇద్దరు భార్యలు కన్నీరు మున్నీరు కావడం అక్కడ ఉన్న వారందరిని కదిలించింది. అప్పటి వరకు మాటల్లేని వారిద్దరు మధ్య ఒకరినొక్కరు పట్టుకుని ఏడవడం చేస్తే వారిని హరికృష్ణ ఎంతలా చూసుకునేవారో అర్థం అవుతుంది. హరికృష్ణ మొదటి భార్యతో మోహిదిపట్నంలోనే ఉంటున్నారు.ఈ రోజు సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.