ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తన నిజాయతీ చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా రైతులను ఆదుకునేందుకు రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది. హరీష్ శంకర్ స్వగ్రామమైన మహబూబ్ నగర్ జిల్లా కమ్మదనం గ్రామంలో సొంత వ్యవసాయ భూమి ఉంది దాంతో అతడికి కూడా కొంత ప్రభుత్వ సాయం అందింది. అయితే ప్రభుత్వం అందజేసిన చెక్ను హరీష్ శంకర్ తిరిగిచ్చేశారు. దీన్ని ఎవరన్నా పేద రైతు సహాయార్థం వాడమని కోరారు.
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య సమక్షంలో గ్రామ సర్పంచ్కు చెక్ను తిరిగిచ్చాడు హరీష్ శంకర్,తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎంతో ఉన్నతమైనదని అన్నారు. ‘నాకు ఉన్న పొలానికి కూడా రైతుబంధు పథకం కింద కొంత మొత్తం వచ్చింది. ఎవరన్నా పేద రైతు సహాయార్థం ఇది వాడితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మొత్తానికి మరికొంత జోడించి నేను సర్పంచ్ గారికి బాధ్యతాయుతంగా అందచేస్తున్నాను’ అని హరీష్ శంకర్ చెప్పారు.