దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతుంది.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇండస్ట్రీలో మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.అయితే ఈ మీటూ ఉద్యమంపై కొందరు తమ స్వార్థం కోసం కూడా వాడుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.తాజాగా కన్నడ హీరోయిన్ ఈ మీటూ ఉద్యమం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.కన్నడ హీరోయిన్ హర్షిక పూనాచా ‘మీటూ’ అంటూ బయటకొచ్చి స్టేట్మెంట్లు చేస్తోన్న నటీమణులపై ఫైర్ అయింది.మీటూ అంటు బయటకి వచ్చి మాట్లాడుతున్న వారిపై మండిపడింది హర్షిక పూనాచా.
తమ కెరీర్ మొదట్లో డబ్బు, అవకాశాలు, లగ్జరీ లైఫ్ కోసం అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయి వారి చుట్టూ ఉన్న మగాళ్లకి పూర్తి స్వేచ్చనిచ్చారు. ఇప్పుడు మాత్రం పబ్లిసిటీ కోసం సొంత ప్రయోజనాల కోసం వారిపై ఆరోపణలు చేస్తున్నారు. మీరు వాళ్ల పక్కలోకెళ్లినప్పుడు మీటూ ఏమైంది..? ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిలో కొందరు హీరోయిన్లు పాటల షూటింగ్ కోసం విదేశాలకి వెళ్లినప్పుడు అక్కడ గంజాయి తాగుతూ హీరోలు, నిర్మాతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో గడపడం నాకు తెలుసనని చెప్పుకొచ్చింది హర్షిక.