డబ్బులిచ్చారు కాబట్టే లిప్ లాక్ చేశాను… ఈ మాటలు మాట్లాడింది ఏ బాలీవుడ్ హీరోయినో కాదు.మన టాలీవుడ్ కుమారి..అదేనండి హీరోయిన్ హెబ్బా పటేల్. ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హెబ్బాకు యూత్లో మంచి క్రేజ్ ఏర్పడింది.అయితే ఆ తరువాత హెబ్బా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో రేస్లో కాస్తా వెనక పడింది.తాజాగా ఆమె నటించిన ’24 కిస్సెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సినిమా టైటిల్ తగినట్లుగానే సినిమా ట్రైలర్ను ముద్దులతో నింపేశాడు దర్శకుడు.
ట్రైలర్లో లెక్కకు మించి రొమాంటిక్ సీన్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ రోమాన్స్పై బోల్ట్ కామెంట్స్ చేసింది హెబ్బా పటేల్.డబ్బులు తీసుకుని ముద్దు సీన్లలో నటించికపోతే ఎలా అంటు ప్రశ్నించింది.డబ్బులు ఇచ్చారు కాబట్టే లిప్ లాక్ చేశాను అని చెప్పుకొచ్చింది.దీంతో సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు వెల్లువెత్తాయి. డబ్బిస్తే ఏమైనా చేస్తావా..? అంటూ విమర్శించడం మొదలు పెడుతున్నారు. లిప్ లాక్లపై మాట్లాడి కొత్త సమస్యను కొని తెచ్చుకుంది హెబ్బా.