హీరోయిన్ త్రిష ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అయిన ఇప్పటికి వరుస సినిమాల్లో నటిస్తునే ఉంది. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. కొత్త భామలు ఎంట్రీ ఇవ్వడంతో త్రిషకు కాస్తా అవకాశాలు తగ్గాయి. తెలుగులో ఈ భామకు ఒక్క అవకాశం కూడా లేదు. కాని తమిళంలో మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే త్రిష 96 సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది.
తాజాగా త్రిష మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు కథ , మాటలు స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు జర్నీ ఫేం శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి ‘రాంగీ’అనే టైటిల్ ని నిర్ణయించారు.ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న త్రిష సడెన్ గా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో వెంటనే ఆమెను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. దీంతో త్రిష అభిమానులు ఆందోళన చెందుతూ ఆమెకి ఎలా ఉందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
తాజాగా దీనిపై త్రిష తల్లి ఉమాక్రిష్ణన్ స్పందించారు. త్రిషకి ఎలాంటి సమస్య లేదని, తను ఆరోగ్యంగా ఉందని తెలిపింది. వరుస షూటింగ్లతో బిజీగా ఉండటం వల్లే త్రిష కళ్లు తిరిగి పడిపోయారని ఆమె తల్లి తెలిపింది. ప్రస్తుతం త్రిష ఆరోగ్యం బాగానే ఉందని , త్వరలోనే షూటింగ్లో పాల్గొంటారని త్రిష తల్లి ఉమాక్రిష్ణన్ వెల్లడించారు.
- Advertisement -
షూటింగ్లో స్పృహ తప్పి పడిపోయిన త్రిష..కారణం అదేనా!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -