టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర చర్చ నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు కోసం పడుకొవలని నటి శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసింది.ప్రముఖ నిర్మాత దగ్గుబాటి కుమారుడు అభిరాం తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వాడుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది.వారిద్దరు కలిసి దిగిన కొన్ని ఫోటోలను మీడియాకు విడుదల చేసి సంచనానికి దారి తీసింది.దీనిపై ఇండస్ట్రీలో హీరోలు ఎవరు పెద్దగా స్పందించలేదు.తాజాగా ఈ ఇష్యూపై హీరో బాలకృష్ణ స్పందించారు.
ఆయన హీరోగా నటించిన ‘జై సింహ’ సినిమా ఆదివారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిలకలూరిపేటలోని న్యూ మార్కెట్ యార్డ్ గ్రౌండ్లో శతదినోత్సవ వేడుకను నిర్వహించిన వేడుకలో బాలయ్య పాల్గొన్నారు.ఈ ఫంక్షన్లో బాలయ్య మాట్లాడుతు క్యాస్టింగ్ కౌచ్పై కొంతమంది పోరాటం చేయడం మంచి పరిణామామే. ఈ పోరాటం ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం’’ అని బాలయ్య అన్నారు.