- Advertisement -
గత కొంతకాలంగా హీరో గోపిచంద్కు కలిసి రావడం లేదు. వరుస ప్లాప్లతో ఇబ్బంది పడుతున్నాడు.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని కసితో వస్తున్నాడు. గోపిచంద్ తాజా చిత్రం పంతం.గోపిచంద్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కె. చక్రవర్తి అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో గోపిచంద్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేశారు. పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో సక్సెస్ కొట్టి తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు గోపిచంద్.