తెలుగు సినీ పరిశ్రమలో మంచు కుటుంబానికి చెందిన నటులు అడపదడపా సినిమాలు చేస్తుంటారు. మంచు మనోజ్ కూడా వరుస సినిమాలు చేస్తూ సినిమా ఫలితం పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పుడు కొన్నాళ్లు ఆగిన తర్వాత బాగా ఆలోచించి ఓ సినిమాతో వస్తున్నాడు. శౌర్య, ఎటాక్, గుంటూరోడు.. ఒక్కడు మిగిలాడు సినిమాలతో మంచు మనోజ్ వచ్చాడు. అసలు ఆ సినిమాలు ఉన్నాయా? విడుదలయ్యాయా? అని ప్రశ్నించేంతగా పరాజయం పొందాయి. ఆ సినిమా మాదిరి కావొద్దని బాగా ఆలోచించి చాన్నాళ్లకు ఓ సినిమాతో వస్తున్నాడు.
‘ప్రయాణం’, ‘మనసంతా’ సినిమాలు తీసిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో సినిమాకు అంగీకరించినట్టు సమాచారం.. ఇంతకుముందు మనోజ్తో చంద్రశేఖర్ ‘ప్రయాణం’ అనే విభిన్న సినిమా తీశారు. కానీ ఆడలేదు. ఇప్పుడు మరోసారి సినిమా తీయడానికి అంగీకరించాడు. అయితే గత సినిమా మాదిరి కాకుండా కమర్షియల్గా క్లిక్కయ్యే ఓ విభిన్నమైన కథతో సినిమా చేయనున్నారని సమాచారం. మంచు ఫ్యామిలీ బ్యానర్లో మనోజ్ హీరోగా ఈ సినిమా రాబోయే అవకాశం ఉంది.