Tuesday, May 21, 2024
- Advertisement -

శ్రీవారి స‌న్నిధిలో చెర్రీ దంపతులు

- Advertisement -
  • స‌తీస‌మేతంగా ద‌ర్శ‌నం

మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్‌తేజ్ స‌తీస‌మేతంగా తిరుమ‌ల శ్రీవెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న ఇద్ద‌రు వేకువ‌జామున తిరుమ‌లేశుడి స‌న్నిధిలో గ‌డిపారు. వీఐపీ ప్రారంభ ద‌ర్శ‌నంలో స్వామివారి సేవ‌లో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద రామ్‌చరణ్‌ను చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు తీసుకోవ‌డానికి ఎగ‌బడ్డారు.

ప్రస్తుతం రామ్‌చ‌ర‌ణ్‌తేజ రెండు సినిమాల‌పై బిజీగా ఉన్నాడు. ఒక‌టి రంగ‌స్థ‌లం 1986, రెండో త‌న తండ్రి న‌టిస్తున్న సైరా.. ఉయ్యాల‌వాడ న‌ర్సింహారెడ్డి సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప‌నుల‌తో బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. ఈ రెండు చిత్రాలు చెర్రీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిల‌వాల‌ని భావిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -