సినిమా చూపిస్తా మావ – నేను లోకల్ సినిమాల్లో మామఅల్లుళ్ల నేపథ్యంలో త్రినాథ రావు నక్కిన సినిమాలు తీసి హిట్ కొట్టాడు. మళ్లీ అదే కథాంశంతో వరుసగా మూడోసారి కూడా త్రినాథరావు ఓ సినిమా తీయబోతున్నాడు. ఉన్నది ఒక్కటి జిందగీ సినిమాతో హిట్ అందుకున్న రామ్ ఈ సినిమాలో నటించనున్నాడు. ఒంగోలు గిత్త సినిమాలో మామఅల్లుళ్లుగా నటించిన ప్రకాశ్రాజ్, రామ్ మళ్లీ త్రినాథరావు సినిమాలో కనిపించనున్నారు.
మామ అల్లుళ్ల సవాల్ సినిమాలు త్రినాథరావు చాలా కొత్తగా తన స్టైల్లో చూపిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు తన ఎస్వీసీలో ప్రొడక్షన్లో ఈ సినిమాను తీయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. రామ్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. ప్రసన్నకుమార్ కథ అందిస్తున్నాడు. ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా ఉండనుందని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2018 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.