హీరోలుగా అవకాశాలు తగ్గిన చాలామంది హీరోలు విలన్లగా మారుతున్నారు.ఇప్పడు మరో హీరో విలన్గా మారాడు.శంకర్ దర్శకత్వంలో విడుదలైన ‘బాయ్స్’ చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకర్షించిన నటుడు సిద్ధార్థ్. తెలుగు తమిళ్ , హిందిలో కూడా మంచి గుర్తింపు తెచ్చకున్నాడు.కాని తరువాత కాలంలో వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. సినిమాలలో అవకాశాలు కూడా తగ్గాయి.మొన్న ఆ మధ్య వచ్చిన హర్రర్ మూవీ గృహంని సిద్ధార్థ్ స్వయంగా నిర్మించారు.ఆ సినిమా తరువాత మనోడి దగ్గర ఒక్క సినిమా కూడా లేదు.ఇక చేసేది లేక విలన్ రోల్స్ కూడా ఓకే చెబుతున్నాడు.
ప్రస్తుతం మలయాళ చిత్రసీమకు ఆయన పరిచయం కానున్నారు. మలయాళ హీరో దిలీప్ ప్రధాన పాత్రతో తెరకెక్కుతున్న ‘కమ్మర సంభవం’లో ప్రతినాయకుడిగా సిద్ధార్థ్ నటిస్తున్నారు. ఇందులో ఆయన క్యారెక్టరు హీరోకు ధీటుగా ఉంటుందని సమాచారం. అందుకే ఆ క్యారెక్టరులో నటించడానికి సిద్ధార్థ్ సమ్మతించారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.