- Advertisement -
రోబో 2.0 సినిమా పూర్తి అవ్వడంతో తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు స్టార్ డైరెక్టర్ శంకర్.భారతీయుడు సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించే పనిలో పడ్డాడు శంకర్.కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాలో విలన్గా అజయ్ దేవగన్ నటిస్తున్నారని సమాచారం.తాజాగా ఈ సినిమాలో హీరో శింబు కూడా నటించనున్నారని తెలుస్తుంది.
శింబుని ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం తీసుకోవాలని అనుకుంటున్నారు. దాదాపు శింబు ఎంట్రీ ఖాయమని అంటున్నారు. ఈ సినిమాలో అతడు పోలీస్ పాత్ర పోషిస్తాడని అంటున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. ఇటీవల శింబు ‘నవాబ్’ సినిమాలో ఇతర హీరోలతో కలిసి స్క్రీన్ పంచుకున్నాడు. కమల్ తో కలిసి నటించనున్న శింబుకి ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి!