టాలీవుడ్ హీరోయిన్ మదలాస శర్మ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్కు చెందిన స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు మహాక్షయ్ చక్రవర్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది హీరోయిన్ మదలాస.అయితే వీరి పెళ్లికి ముందు పెద్ద హైడ్రామా నడిచింది.ఓ యువతి మహాక్షయ్ చక్రవర్తిపై రేప్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహాక్షయ్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.దీంతో వీరి పెళ్లికి బ్రెక్ పడిందని అనుకున్నారు అందరు.
కాని బెయిల్పై బయటికి వచ్చిన మహాక్షయ్ చక్రవర్తి మదలాస శర్మను వివాహం చేసుకున్నాడు.ప్రస్తుతం ఈ జంట హనీమూన్ను ఆస్వాదిస్తోంది. వీరు అమెరికాలో విహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు మదల్సా ఇన్స్టాగ్రమ్లో ఒక ఫొటోను పోస్టు చేసింది. ఈ విధంగా తమ హనీమూన్ అప్డేట్ను ఇచ్చింది ఆ హీరోయిన్.బెయిల్ మీద మహాక్షయ్ గడువు తిరగానే మళ్లీ కోర్టులో హాజరు కావాల్సి ఉంది.