Friday, March 29, 2024
- Advertisement -

ఆకట్టుకుంటున్న ‘హీరో’టీజర్

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు, దర్శక, నిర్మాతల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొద్ది మంది మాత్రమే ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకోగలిగారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. రమేష్ బాబు తర్వాత నిర్మాతగా మారిపోయారు. ఇక మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగారు. ఈ కుటుంబం నుంచే సుధీర్ బాబు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

తాజాగా కృష్ణ మనువడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు, గుంటూరు టిడిపి ఎంపి జయదేవ్ గల్లా కొడుకు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పేరు ‘హీరో’. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ , టైటిల్ టీజర్ ను మహేశ్ బాబు బుధవారం విడుదల చేశారు. ఈ సినిమాను అమరరాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు , నరేష్, సత్య, అర్చన సౌందర్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైందని, త్వరలోనే థియేటర్లలో విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులకు ఆయన అభినందనలు తెలిపారు. ’హీరో‘ సినిమా మంచి విజయం సాధించాలని మహేశ్ బాబు ఆకాంక్షించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -