హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో దూసుకుపోతుంది.టాలీవుడ్లో యంగ్ హీరోలందరితో సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా మారింది.తాజాగా రామ్ సరసన హలో గురు ప్రేమ కోసమే సినిమా చేస్తుంది.ఈ సినిమా దసరాకి విడుదల చేయనున్నారు.అనుపమా పరమేశ్వరన్ ను నటుడు ప్రకాశ్ రాజ్ తిట్టాడని, దీంతో ఏడుపు లంఘించుకున్న ఆమె, కళ్లు తిరిగి కిందపడిపోగా, ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని జరుగుతున్న ప్రచారంపై అనుపమా పరమేశ్వరన్ స్పందించింది.
తమ మధ్య జరిగిన చాలా చిన్న ఘటనను చాల పెద్దగా ప్రచారం చేసి చూపించారిని వాపోయింది.. ప్రకాష్ రాజ్ తనకో చిన్న సలహాను ఇచ్చారని, అది ఆయన్నుంచి తనకు చేరే సరికి పుకారుగా మారిందని చెప్పింది.ఈ ఘటన జరిగిన తరువాత కూడా తాము 25 రోజులు కలసే షూటింగ్ చేశామని, తమ మధ్య సత్సంబంధాలే ఉన్నాయని వెల్లడించింది. ప్రకాష్ రాజ్ తో కలసి పని చేయడం తనకు ఆనందాన్ని ఇస్తుందని తెలిపింది అనుపమ.
