Saturday, April 20, 2024
- Advertisement -

హీరోయిన్ మాయలో సుధీర్.. రష్మీకి షాక్..!

- Advertisement -

బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మీలకు మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరు కలిసి చేసే రొమాంటిక్ కామెడీని జనాలు ఎంజాయ్ చేస్తారు. సుధీర్ తన మాటలతో, చేష్టలతో రష్మీని పడేయాలని ట్రై చేస్తుంటే.. నీకంత సీన్ లేదని రష్మీ కౌంటర్ ఇస్తూ ఉంటుంది. నిజానికి వీరు లైవ్ లోకి వచ్చినప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చుగా అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతుంటారు. వీళ్లు కూడా ప్రేమలో ఉన్నట్లు స్కిట్లు, డైలాగ్స్ తో అలరిస్తుంటారు.

అయితే నిజ జీవితానికి వచ్చేసరికి తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని చెబుతుంటారు. ఇక వీరిద్దరి జంటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రష్మీని సుధీర్ కాకుండా వేరేవాళ్లను చూసిన.. సుధీర్ ను రష్మీ కాకుండా వేరే వాళ్లను చూసిన ఫ్యాన్స్ తట్టుకోలేరు. దాన్ని అస్త్రంగా చేసుకుని పలు కార్యక్రమాల నిర్వాహకులు రష్మీ, సుధీర్ మధ్య వేరొకర్ని ఎంటర్ చేయింది.. షోని ఎక్కువ మంది చూసేలా చేస్తున్నారు. తాజాగా అలాంటిదే ఢీ ఛాంపియన్స్ లో జరిగింది.

ఢీ షో నుంచి ప్రదీప్ తప్పుకోవడంతో టీం లీడర్లు సుధీర్, రష్మీ యాంకర్స్ గా మారారు. వీరి స్థాంలో రవి, వర్షిణి టీం లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవలే ఢీ ఛాంపియన్స్ షోకి పూర్ణ హాజర్ కాలేదు. దాంతో ఆమె స్థాంలో ఒకప్పటి హీరోయిన్ లైలాను గెస్ట్ గా వచ్చారు. ఆమెను చూడగానే సుధీర్ షాక్ లోకి వెళ్లిపోయాడు. ఆమె వేదికపైకి రావడం ఆలస్యం.. ఆమె అక్కడ ఉన్నంత సేపు సుధీర్ ఆమెను చూస్తూ గాల్లో తేలిపోయాడు.

పైగా ఆమె చేయి పట్టుకుని జడ్జి సీట్లో కూర్చొబెట్టాడు. ఈ సీన్ చూసిన రష్మీ ఆశ్చర్యపోయింది. సుధీర్ ను కొట్టాలి అన్నట్లు వెనకనుంచి సైగ కూడా చేసింది. అతడు వేదికపైకి తిరిగి వస్తుండగా.. పక్కకు వెళ్లు అన్నట్లు చిలిపి కోపం చూపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -