Saturday, May 4, 2024
- Advertisement -

భీమవరంలో త‌మ‌న్నా.. అక్క‌డే ప‌వ‌న్‌ను క‌లుస్తుందా?

- Advertisement -

హీరోయిన్ త‌మ‌న్నా భీమ‌వ‌రం వెళ్లారు.హ్యాపీ మొబైల్ మల్టీబ్రాండ్ రిటైల్ స్టోర్ షోరూం ఆరంభోత్సవ వేడుక కోసం ఆమె భీమ‌వ‌రం వెళ్లింది.హ్యాపీ మొబైల్ షాప్ ఆరంభోత్సవ వేడుక త‌రువాత ఆమె అభిమానుల‌తో కాసేపు ముచ్చ‌టించింది.భీమవరం త‌న‌కు బాగా నచ్చింద‌ని,ఇక్క‌డ వాత‌వార‌ణం చాలా ప్ర‌శాంతంగా ఉంద‌ని తెలిపింది.హీరో ప్ర‌భాస్ సొంత ఊరికి వ‌చ్చాన‌ని,అత‌నితో చెబుతాన‌ని చెప్పి అక్క‌డ ఉన్న వారిని ఉత్స‌హాప‌రిచింది.హిందీ కన్నా తెలుగు బాలా మాట్లాడగలనని, ముంబైలో పుట్టినా తెలుగు అమ్మాయిలాగా చూస్తారని అన్నారు.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికి ఓ అభిమాని నుండి అనుకోని ప్ర‌శ్న ఆమెకు ఎదురైంది.జ‌న‌సేన అధినేత న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ‌వ‌రంలోనే ఉన్నార‌ని ,మీరు ఆయ‌నిని క‌లుస్తారా అని ఓ అభిమాని త‌మ‌న్నాను ప్ర‌శ్నించాడు.దీంతో త‌మ‌న్నా ఆ అభిమానికి చాలా తెలివిగా స‌మాధానం చెప్పింది.ఆయ‌న ఇక్క‌డికి వేరే ప‌ని మీద వ‌చ్చారు.మ‌నం వెళ్లి ఆయ‌న‌ను ఇబ్బంది పెట్ట‌కుడ‌ద‌ని చెప్పి త‌ప్పించుకుంది.ప‌వ‌న్ ,త‌మ‌న్నా ఇద్ద‌రు క‌లిసి కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు సినిమా చేసిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -