అక్కినేని ఇంటి కోడలు,హీరోయిన్ సమంతకు కోపం వచ్చింది.దీంతో తన మేనేజర్పై ఆగ్రహాం వ్యక్తం చేసింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే….తనకు చెప్పకుండా తన మేనేజర్ మహేంద్ర, దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ లు హ్యాపీగా పార్టీ చేసుకోవడంపై చిలిపిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల విడుదలైన ‘చిలసౌ’, ‘గూఢచారి’ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ రెండు సినిమాల్లో నటించిన వెన్నెల కిశోర్, మహేంద్ర, రాహుల్ లు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు.
ఈ చిత్రాల సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని, అడవి శేషు, రాహుల్ రవీంద్రన్ కోసం వెయిట్ చేస్తున్నానని మహేంద్ర ట్వీట్ చేయగా, సమంత వాటిని చూసింది. “ఈ ట్వీట్ ను ఎవరు టైప్ చేశారు.. ముందు అది చెప్పు” అని సమంత వెంటనే స్పందించింది. పార్టీకి తనను ఎందకు పిలవ లేదని సమంత ఆగ్రహించినట్లు తెలుస్తుంది.ఇదింతా సమంత సరాదాగా చేసిందని ఆమె ట్వీట్ చూస్తే అర్థం అవుతుంది.