తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టి బడా నిర్మాతగా ఎదిగారు బండ్ల గణేష్. గత ఎన్నిలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు టికెట్ దక్కకపోవడంతో 2019లో పార్టీని వీడారు. అయితే ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అంటు వస్తున్నారు. అంతే కాదు ఈ ఏడాది మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటించారు.
ప్రస్తుతం తన బిజనెస్, మూవీస్ పైనే ఫోకస్ అంటున్నారు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ బీజేపీలో చేరుతున్నారని వదంతులు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన ఆయన.. మళ్లీ రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు లేదని, తానిప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నానని, తనపై వస్తున్న పుకార్లను అస్సలు పట్టించుకోవద్దని అంటూ ట్వీట్ చేశారు.
ఏది ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు మొర్రో అని బండ్ల గణేశ్ ఎంత మొత్తుకున్నా పుకార్లకు మాత్రం ఫుల్స్టాప్ పడడం లేదు.
ఈ టాప్ విలన్ల రెమ్యునరేషన్ ఎంతంటే..?
గ్రేటర్ ఫైట్.. బడా నేతల హల్ చల్!
దుబ్బాకలో బీజేపి గేలుపు కాదా..? హరీష్ రావుపై అదిష్టానం గేలుపేనా..?