Thursday, March 28, 2024
- Advertisement -

ఆ క్షణంలో ఎంతో భయపడ్డాను : రాశీఖన్నా

- Advertisement -

టాలీవుడ్ యువ హీరో నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న చిత్రం థ్యాంక్యూ. విక్ర‌మ్ కుమార్ డైరెక్షన్ లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో రాశీఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో మొదటి నుంచి కూడా రాశి ఖన్నా అవకాశాల కోసం పరుగులు పెట్టినట్టుగా కనిపించలేదు. నెమ్మదిగా ఒక్కో అవకాశాన్ని అందుకుంటూనే ఆమె ముందుకు వెళ్లింది. ఆ మద్య కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను వరకూ తమిళ సినిమాలు ఉన్నాయి.

ఇటీవల ఈ సినిమా టీమ్ ఇటలీ వెళ్లి అక్కడ కొంతవరకూ షూటింగు పూర్తిచేసుకుని వచ్చింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ విషయాల గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ.. కోవిడ్ నేప‌థ్యంలో ఇట‌లీ వెళ్లేందుకు చాలా భ‌య‌ప‌డిన‌ట్టు చెప్పింది. కోవిడ్ కేసులు పెరుగుతుండ‌టంతో మొద‌ట ఇట‌లీకి వెళ్లాలంటే భ‌య‌ప‌డ్డా. ఇటలీ వెళ్లినప్పటికీ అందరిలోను టెన్షన్ ఉంది. కానీ కీల‌క షెడ్యూల్ ను తొంద‌ర‌గా పూర్తి చేయాల్సిన నేప‌థ్యంలో..సెట్స్ లో క‌ఠినంగా కోవిడ్ రూల్స్ పాటిస్తూ సీన్ల‌ను చిత్రీక‌రించాం.

అక్కడ కొన్ని లొకేషన్స్ లో కరోనా కేసులు బయటపడటంతో అనుమతులు లభించలేదు. దాంతో మా టెన్షన్ మరింత పెరిగిపోయింది. మొత్తానికి మేము ఒక్కో రోజు 18 గంట‌లపాటు షూటింగ్స్ లో పాల్గొని వేగంగా పూర్తి చేశామని చెప్పుకొచ్చింది.అనుకున్నట్టుగా షూటింగును పూర్తిచేసుకుని హమ్మయ్య అనుకున్నాము అని చెప్పుకొచ్చింది.

మన ప్రాణాలు కాపాడుకోవాలంటే.. ప్రభుత్వానికి సహకరించండి : కీర్తి సురేష్

నటుడు సోనుసూద్ కి నోటీసులు జారీ చేసిన ముంబై హైకోర్టు?

ఏకంగా తనని టైటానిక్ హీరోయిన్ తో పోల్చుకున్న యంగ్ హీరో .. ఫోటో వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -