తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరో విశాల్కు ప్రత్యేక స్థానం ఉంది. విశాల్ తెలుగు వ్యక్తి అయిన తమిళంలో బాగా ఫేమస్ అయ్యాడు.ప్రస్తుతం విశాల్ తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.రాజకీయలలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు విశాల్. ఆయన నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబు థిరై’ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో ‘అభిమన్యుడు’గా రీలిజ్ చేస్తున్నారు.ఈ సినిమాలో విశాల్కు జంటగా సమంత చేసింది. సినిమా హిట్ సాధించడంతో ఫుల్ జోష్లో ఉన్నాడు విశాల్.అయితే గత కొంతకాలంగా విశాల్ పెళ్ళిపై అనేక వార్తలు వెలువడుతున్నాయి.
దీనిపై స్పందించిన విశాల్ నేను తమిళ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో అందరు హీరోయిన్ వరలక్ష్మి అని ఫిక్స్ అయ్యారు.గతంలో వీరిద్దరు ప్రేమించుకున్నారని వార్తలు కూడా వచ్చాయి.హీరోయిన్ వరలక్ష్మి తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె.గతంలో శరత్ కుమార్కు విశాల్కు మధ్య కొన్ని గొడవలు వచ్చిన సంగతి తెలిసింది.ప్రస్తుతం విశాల్ ‘పందెం కోడి 2’సినిమాలో బిజిగా ఉన్నాడు. ఈ సినిమాలో వరలక్ష్మి విలన్ పాత్రలో కనిపిస్తోంది. విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది.