- Advertisement -
ఈ నెల 18 న లోఫర్ సినిమా విడుదల కి సర్వం సిద్దం చేసారు. అంతకంటే ముందే ఈ నెల ఏడు న ఆడియో విడుదల కి సిద్దం అవుతున్నారు అందరూ. అయితే ఈ ఆడియో వేదిక మీద ముఖ్య అతిధి ఎవరు అనేది పెద్ద చర్చగా మారింది.
సహజంగా మెగా హీరోల ఆడియో ఫంక్షన్ లకి చిరంజీవి గెస్ట్ గా కనిపిస్తారు. కానీ పూరీ – చిరు ల మధ్య 150 సినిమా విషయం లో తలెత్తిన వివాదం కారణంగా చిరు ఈ ఆడియో కి రాలేను అని నాగబాబు తో ముందరే చెప్పేశాడట.
దీంతో చిరంజీవి బ్లెస్సింగ్స్ ఇక్కడ మిస్ అవుతున్నాయి. అయినా కానీ చిరు దీవెనల కోసం ఒక స్పెషల్ బైట్ ని సిద్దం చేస్తున్నారు. పెదనాన్న లేకుండా ఆడియో బాగోదు అని కనీసం ఒక బైట్ అయినా ఇవ్వండి అని వరుణ్ తేజ్ కోరడంతో ఈ ఆడియో కోసం చిరు బైట్ ని సిద్దం చేస్తున్నారు. డిసెంబర్ 7 న ఈ సినిమా ఆడియో ఉండబోతోంది.