- Advertisement -
ఇస్రో చేపట్టిన చంద్రయాణ్ 2 విజయవంతం అవడంపై దేశ ప్రధానితో పాటు అన్ని రంగాల సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకూడా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇటీవల ఇస్రో జీఎస్ఎల్వీ మార్క్ (ఎంకే)-3 రాకెట్ సాయంతో ‘చంద్రయాన్ 2’ను జాబిల్లిపైకి పంపిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక ‘చంద్రయాన్ 2’ విజయం వెనకున్న మహిళా శాస్త్రవేత్తలు ముత్తయ్య వనిత, రీతూ కరిధాల్ మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. నేను శాస్త్రవేత్తను అవ్వాలనుకున్నాను. వీరిద్దరినీ చూశాక కలలు నిజమవుతాయని అనిపించింది. ఇస్రో టీంను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు.