Tuesday, April 23, 2024
- Advertisement -

పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌక కి మరో దేశంతో సంబందం..!

- Advertisement -

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్​) నుంచి కాసేపట్లో.. పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌకను ప్రయోగించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ప్రీకౌంట్ డౌన్ మెుదలైంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం నిన్న ఉదయం 8.24 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. 26 గంటల పాటు నిరంతరాయంగా కౌన్ డౌన్ కొనసాగి.. ఈ ఉదయం 10.24గంటలకు అంతరిక్షంలోకి పీఎస్ఎల్వీ దూసుకుపోనుంది.

ఈ రాకెట్ ద్వారా బ్రెజిల్​కు చెందిన అమోజోనియా-1, మన దేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే షార్​కు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు చేరుకున్నారు. ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ కైలాస వాడివో శివన్ పర్యవేక్షించనున్నారు.

శ్రీహరికోటకు ఆనుకుని ఉండే.. సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ ఆలయాన్ని ఇస్రో ఛైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు దువ్వూరు బాలచంద్రారెడ్డి అధికారులు శివన్​ దంపతులకు స్వాగతం పలికారు. నేడు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌక విజయవంతం కావాలని ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

ఆన్‌లైన్‌ తరగతులకు డేటా ఫ్రీ..!

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

తెలంగాణా లో కరోనా ఉందా… సీఎస్ సోమేశ్ కుమార్ మాటలలో..!

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -