Wednesday, April 24, 2024
- Advertisement -

మ‌హేష్ బాబు సినిమానుంచి త‌ప్పుకోవ‌డంపై క్లారిటీ ఇచ్చిన జ‌గ్గుభాయ్‌..

- Advertisement -

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా, అనిల్‌ రావిపూడి నిర్మిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా జ‌గ‌ప‌తి బాబు త‌ప్పుకోవ‌డం సినీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. సినిమా నుంచి సీనియర్ నటుడు జగపతిబాబు అవమానకర రీతిలో బయటికొచ్చేశాడంటూ గత కొన్నిరోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. మహేష్‌, జగపతి బాబు మధ్య విభేదాల కారణంగానే ఆయన సినిమా నుంచి తప్పుకున్నారనె వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై జగపతిబాబు స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు మహేష్‌తో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. ‘సినీ పరిశ్రమ అనేది నాకు కుటుంబంతో సమానం. వారి గురించి మాట్లాడటం సరికాదు. కానీ నాపై వస్తున్న తప్పుడు కథనాల మూలంగా 33 ఏళ్ల సినీ జీవితంతో తొలిసారి వివరణ ఇస్తున్నా. మహేష్‌ బాబు సినిమా నుంచి నన్ను తప్పించారంటూ వార్తలు వస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తల‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.

పరిస్థితుల కారణంగానే నేను సినిమానుంచి త‌ప్పుక‌న్నాని…మ‌హేష్ బాబుతో ఎలాంటి విబేధాలు లేవ‌న్నారు. ఆ పరిస్థితులేంటో మాత్రం తన వీడియోలో వెల్లడించలేదు. దాంతో, మరికొన్ని ఊహాగానాలకు అవకాశం ఇచ్చినట్టయింది. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు” అంటూ జగపతిబాబు వీడియోలో తన వైఖరిని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -