Saturday, May 18, 2024
- Advertisement -

అత‌నంటే పిచ్చి అంటున్న శ్రీదేవి కూతురు

- Advertisement -

శ్రీదేవి కూతురు జాహ్న‌వి క్రేజ్ ఎలా ఉందో అంద‌రికి తెలిసిందే. ఇంకా ఒక్క సినిమా కూడా విడుద‌ల కాక‌ముందే ఆమె స్టార్‌డ‌మ్ పొందింది. ధడక్‌ సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతుంది జాహ్న‌వి.సినిమా షూటింగ్ పూర్తి కావ‌డంతో తనను తాను ప్రమోట్‌ చేసుకునే పనిలో ప‌డింది.ఓ ప్రముఖ మ్యాగ్జైన్‌ ఫోటో షూట్‌తో ఆకట్టుకున్న జాన్వీ, ఆ వెంటనే బాలీవుడ్‌ స్టార్ మేకర్‌ కరణ్‌ జోహర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను ఆమె పేర్కొన్నారు.

త‌న అభిమాన న‌టుడు ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌కు జాహ్న‌వి ఠ‌క్కున రాజ్‌కుమార్‌ రావ్ అని చెప్పేసింది. ఆయ‌న‌తోపాటు నవాజుద్దీన్‌ సిద్ధిఖీలతోపాటు కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె చెప్పారు. ‘వాళ్ల నటన అద్భుతంగా ఉంటుంది. అందుకే వారంటే నాకు ఇష్టం’ అని జాన్వీ చెప్పారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -