- Advertisement -
సిద్దు జొన్నలగడ్డ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం టిల్లు స్వ్కేర్. ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. తార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై తెరకెక్కగా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.
లిల్లీ-టిల్లు లొల్లి ఆడియన్స్ ని బాగా నవ్వించగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు దర్శకుడు మల్లిక్. ఇప్పటివరకు రూ.95 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఏప్రిల్ 8న సినిమా సక్సెస్మీట్ని నిర్వహించనుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా రానున్నారు.
డీజే టిల్లు సినిమాకు ఫిదా అయిన ఎన్టీఆర్..తాజాగా టిల్లు స్వ్కేర్ సినిమాపై ప్రశంసలు గుప్పించారు. తాజాగా టిల్లు స్వ్కేర్ సక్సెస్మీట్కు ఎన్టీఆర్ రానుండటం ఫ్యాన్స్లో జోష్ నింపింది.