Thursday, May 23, 2024
- Advertisement -

మళ్లీ ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్!

- Advertisement -

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాకు సిద్ధం అవుతున్నాడట జూనియర్ ఎన్టీఆర్. గతంతో ఈ దర్శకుడి తో ‘బృందావనం’ సినిమా చేశాడు ఈ హీరో. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్ రిపీటవుతోందని సమాచారం.

‘బృందావనం’ ఎన్టీఆర్ కు మంచి విజయాన్ని సాధించిపెట్టింది.  ఆ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కావడంతో ఎన్టీఆర్ కెరీర్ గాడిన పడింది. 

ప్రస్తుతానికి అయితే జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకొంటోంది. అది కాస్తా పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ వంశీ పైడి పల్లి సినిమాను ఓకే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి వంశీ కూడా నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మల్టీ స్టారర్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఆ సినిమా పూర్తి అయిన తర్వాత వంశీ పైడిపల్లి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రాబోతోందని సమాచారం. ప్రస్తుతం వంశీ ఈ సినిమా కు స్క్రిప్ట్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -