ఎన్టీఆర్ ‘బిగ్బాస్’ షో హోస్ట్ అయిన నాటి నుంచి అతడికి క్రేజీ బాగా పెరిగింది. ఎన్టీఆర్ డేట్స్ ఖాళీగా ఉంటే మాత్రం ఎన్నో షోలు చేయడానికి ఆయా నిర్వాహకులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్తో ఏమైనా షోలు చేయడానికి వివిధ సంస్థలు, చానల్స్ ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ‘బిగ్బాస్’ షో తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో ఆ చానల్కు అత్యధిక టీఆర్పీ రేటింగ్ పొందింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఎన్టీఆర్ను బ్రాండ్ అంబాసిడర్ చేశారు.
ప్రస్తుతం దానికి సంబంధించిన షూట్లో తారక్ పాల్గొంటున్నాడు. అయితే ఐపీఎల్ కోసం ఆయన ప్రోమో షూట్లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఎన్టీఆర్ పక్కన ప్రముఖ హాస్యనటుడు మధు కూడా ఉన్నాడు. దీన్ని దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్నాడని సమాచారం. ఎందుకంటే త్రివిక్రమ్ వాణిజ్య ప్రకటనలు రూపొందించాడు.
ఐపీఎల్ ప్రచారం కోసం తారక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒప్పందం చేసుకున్నారు. స్టార్ మా యాజమాన్యం దీన్ని రూపొందిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్స్లో షూట్ జరుగుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ తారక్ తమ సినిమాతో బిజీ అవుతారు.