- Advertisement -
తారకుడు మరోసారి మైక్ పట్టుకోబోతున్నాడు.మైక్ పట్టుకోవడమంటే ఏదో స్పీచివ్వడానికి కాదు.తనదైన శైలిలో పాటతో ఐదవస్సారి అదరగొట్టడానికి .ఇప్పటికే యమదొంగ,కంత్రీ,అదుర్స్ ,రభస చిత్రాల్లో తన గొంతును సవరించుకున్నాడు.
చేసిన నాలుగుసార్లు తారకుడు శభాష్ అనిపించుకున్నాడు.అందుకే కాబోలు ఐదవసారి దేవి శ్రీ అడిగాడని స్వరాన్ని సెట్ చేసుకుంటున్నాడు.దీనికి డైరెక్టర్ సుకుమార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేయడంతో తారకుని ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి.
ప్రస్తుతం స్పెయిన్ షూట్లో ఉన్న టీం అక్కడినుంచి వచ్చిన వెంటనే యంగ్ టైగర్ వాయిస్ తో పాటను రికార్డ్ చేయనున్నరు.నాన్నకు ప్రేమతో చిత్రం తారక్ కెరియర్లోనే స్పెషల్ మార్క్ ను టచ్ అవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.