తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన శ్రీరెడ్డి వ్యవహారం టాలీవుడ్ పెద్ద గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. కాస్టింగ్ కౌచ్పై గళ మెత్తిన శ్రీరెడ్డి స్పూర్తితో ఇప్పుడు ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులపై జరుతున్న లైంగిక, శ్రమ దోపిగీ గురించి గలం విప్పుతున్నారు. ఇందుకు న్యూస్ ఛానల్స్ చర్చావేదికా మారాయి.
అయితే కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఇప్పుడు కత్తి మహేష్ మెడకు చుట్టుకుంది. ఎప్పుడూ సమాజం బాగుకోసం మాట్లాడే కత్తి ఈ వ్యవహారంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ ఛానల్ లైవ్ డిబేట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత కత్తిని అడ్డంగా బుక్ చేసింది. సినిమా అవకాశం ఇస్తానని కమిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారని సుతీనీ త సంచలన ఆరోపనలు చేసింది.
సోమాజిగూడలోని ఓ హోటల్కు రమ్మన్నారని అక్కడకు వెల్తే రూంలోకి రమ్మని తనను బలవంతం చేశాడని బాంబు పేల్చిచింది. కత్తిపై పోలీస్ స్టేషన్లో కంప్లెంట్ చేసినా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయలని తెలిపింది. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అవన్నీ కూడా బయట పెడతానని తెలిపింది. అయితే ఈ వ్యవహారం ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో చూడాలి.