తెలుగు ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ కాజల్ అగర్వాల్. టాప్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. పదేళ్లు దాటినా ఈ అమ్మడి అందాలకు అభిమానులు బాగానే ఉన్నారు. గత నెల 30న కుటుంబసభ్యుల సమక్షంలో ప్రియుడి గౌతమ్ కిచ్లును పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ కాజల్. ముంబైలోని ఓ హోటల్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ఆచార్య, కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తుంది.
నూతన దంపతులు కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు తమ హనీమూన్ కు మాల్దీవులకు వెళ్ళారు. అక్కడి ప్రశాంతకరమైన వాతావరణంలో తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది టాలీవుడ్ చందమామ.
భర్తతో కలసి హనీమూన్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తూ… మాల్దీవుల్లోని అందాలను ఆస్వాదిస్తూ.. సముద్రపు అందాల నడుమ ఫొటోలు తీసుకుని ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి కపుడు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది కాజల్ అగర్వాల్.
హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!
బిగ్ బాస్ 4 లో ఎవరెవకి ఎంతెంత రెమ్యునరేషన్ అంటే.. ?