కిశోర్ బి దర్శకత్వం లో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా శ్రీకారం. సమ్మర్లోనే విడుదల కావాల్సి ఈసినిమా కరోనా లాక్ డౌన్ వల్ల అగిపోయింది. ఈసినిమా ఓటిటిలో విడుదల కాబోతుందని ప్రచారం జరిగిన… ఇంకా సినిమా సూటింగ్ మిగిలి ఉండడంతో ఓటిటిలో కూడా విడుదల కాలేదు.
కేంద్ర ఆదేశాల మెరకు సినిమా థియోటర్స్ ఓపెన్ కావడంతో చిత్ర బృందం విడుదలకు సిద్దమవుతున్నారు. ఇందులో బాగంగానే ’భలేగుంది బాల’ అనే పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు. గతం లో నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో ’దారి చూడు దమ్ము చూడ’ అంటు అదిరిపోయే జానపద నెపద్య పాటను రాసి పాడిన పెంచల్ దాసే.. ఈ సినిమాలో ’భలేగుంది బాల’ అనే జానపద నెపద్య పాటను కూడా రాసి పాడారు. ఈ పాట సినిమా అంచనాలను పెంచింది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 24 గంటలోపే 1.5 మిలియన్ వ్యూస్ ను సాధించి రికార్డు సృష్టించింది. దీంతో మరో సారి అదిరిపోయో పాటను అందిచాడు పెంచల్ దాస్.
శ్రీకారం సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా.. రావు రమేష్, నరేష్, ఆమని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. సంగీత దర్శకుడు గా మిక్కీ జె మేయర్ వ్యవహరించారు. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్’ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.
కోట్ల ఆస్తులును జగపతి బాబు ఎలా పోగొట్టుకున్నాడో తెలుసా ?
ప్రభాస్ కి హీరోయిన్ దొరకడం లేదట..!
బిగ్ బాస్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ మోనాల్ కే.. ఎంతంటే ?