Friday, May 3, 2024
- Advertisement -

వాటికి నో అంటున్న కాజల్ అగర్వాల్

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో బిజీ గా గడుపుతున్న హీరోయిన్ల లో ముందు వరుస లో ఉండే హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ భామ ఇప్పటికే సీత అనే సినిమా తో పరాజయం పొందింది. అందుకనే మళ్ళీ తప్పు చేయకూడదు అనే ఉదేశ్యం తో ఈ సారి చేయబోయే సినిమా లో మంచి కథ ఉండేలా చూసుకుంటుంది అని టాక్. కాకపోతే కాజల్ ముందు నుండి కొన్ని కథల కి దూరం గా ఉంటూ వచ్చింది. ఎక్కువ గా కమర్షియల్ సినిమాలు, ఎమోషనల్ డ్రామాలు, లవ్ స్టోరీస్ ని మాత్రమే చేస్తూ వచ్చింది. ఇప్పుడు తన కొలీగ్స్ అందరూ థ్రిల్లర్, హారర్ సినిమాల తో లక్ టెస్ట్ చేసుకుంటున్న నేపథ్యం లో కాజల్ మాత్రం అటువంటి కథలకి దూరం గా ఉంటూ వస్తుంది.

ఇప్పుడు కూడా సీత పరాజయం మర్చిపోయేలా కొంత మంది అద్భుతమైన కథలని తీసుకొని వస్తున్నా కానీ కాజల్ మాత్రం వాటిని ఓకే చేయడం లేదట. థ్రిల్లర్స్ కి దూరం గా ఉంటాను అని కాజల్ చెప్తుంది. కాజల్ క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికి థ్రిల్లర్ కథ కరెక్ట్ అని కొందరు ఫీలవుతూ ఉంటే, కాజల్ మాత్రం వాటికి స్ట్రిక్ట్ గా నో చెప్తుంది.

ప్రస్తుతం కాజల్ ముందు ఉన్న ఒకే ఒక సినిమా రణరంగం. శర్వానంద్ ఈ సినిమా లో హీరో గా చేసాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -