Sunday, April 28, 2024
- Advertisement -

ప్రపంచం మారింది అంటూ ప్రశ్నిస్తున్న కాజోల్.. ఏమైందంటే?

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం తనకు తన భర్త అజయ్ దేవగన్ కు సంబంధించిన ఫోటోలను, విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈమె గత ఏడాది నుంచి దేశవ్యాప్తంగా దాడి చేస్తున్న కరోనా వైరస్ గురించి స్పందించారు.

ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ..2020 నుంచి ప్రపంచ దృష్టి మారింది? అంటూ తన అభిమానులను ప్రశ్నించారు. గత ఏడాది నుంచి నేను మాత్రమే ఇలా ఉన్నాన? లేక ప్రపంచమంతనా? అనే సందేహం వ్యక్తం చేస్తూ బుంగమూతితో సెల్ఫీ తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ పోస్ట్ చూస్తున్న నెటిజన్లు అవును కరెక్టే కదా అనే ఆలోచనలో పడ్డారు.

Also read:ఇంద్రభవనంలాంటి సమంత ఇల్లు.. మీరు ఎప్పుడైన చూశారా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే ప్రతి రోజూ ఎవరో ఒకరు ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:గొప్ప మనసు చాటుకున్న నవీన్ పోలిశెట్టి… అభిమానికి బిగ్ సర్ప్రైజ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -