Saturday, April 20, 2024
- Advertisement -

ఏ హీరోలకు తగ్గేదేలా.. బన్నీ నుంచి మరో పాన్ ఇండియా మూవీ..!

- Advertisement -

తెలుగు అగ్రహీరోలు వరుసబెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా నిరూపించుకోగా, సాహోతో పాన్ ఇండియా ఇమేజ్ ను మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన నుంచి రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్ వంటి పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ లుగా ఎదగ బోతున్నారు.

మహేష్ బాబు కూడా తన తర్వాతి సినిమా రాజమౌళితో తీస్తున్నారు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా కేటగిరిలో నిర్మితమవుతుందనే విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్రహీరోలు అంతా పాన్ ఇండియా బాట పట్టడంతో మరో అగ్ర హీరో అయిన అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా సినిమాలపై మోజు పెంచుకున్నాడు. ఇప్పటికే సుకుమార్ తో ఆయన చేస్తున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా కేటగిరిలో నిర్మిస్తున్నారు. ఇకపై తన నుంచి వచ్చే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నాడు బన్నీ .

పుష్ప తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను కూడా దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత పుష్ప -2 సీక్వెల్ లో బన్నీ నటించనున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ నటించే సినిమా ఏమిటో తాజాగా కన్ఫర్మ్ అయింది. కోలీవుడ్ లో బడా హీరోలతో సినిమాలు తీసే ప్రముఖ నిర్మాత ఎస్. థాను బ్యానర్లో అల్లుఅర్జున్ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.

థాను తమిళంలో అసురన్, తేరి, తుపాకీ వంటి భారీ సినిమాలను నిర్మించి హిట్ అందుకున్నాడు. తాజాగా థానుతో ఓ సినిమా చేసేందుకు బన్నీ సైన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా అతి తొందరలోనే రానున్నట్లు సమాచారం. వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నట్టు టాక్. ఇప్పటికే తమిళ డైరెక్టర్ మురుగదాస్ తో ఓ సినిమా చేసేందుకు అల్లు అర్జున్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే థాను నిర్మించే సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తాడా… లేదా మరో డైరెక్టర్ ను తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -