నేల టిక్కెట్టు ప్లాప్ కావడంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కెరీర్ ఇబ్బందుల్లో పడింది.రెండు హిట్లు కొట్టిన కళ్యాణ్ కృష్ణ మూడో సినిమాతో హ్యాట్రిక్ కొడతారని అంతా భావించారు.రవితేజ హీరోగా నేల టిక్కెట్టుని తీశాడు కళ్యాణ్ కృష్ణ .సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రేక్షకులు ఈ సినిమాను ఫెయిల్గా నిర్ణయించారు.సినిమా అసలు బాలేదనే కామెంట్స్ వినిపించాయి.
దీంతో చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కెరీర్కు ముప్పు ఏర్పడిందని అంటున్నారు.అక్కినేని ఫ్యామిలీకి రెండు హిట్లు ఇచ్చిన ఘనత కళ్యాణ్ కృష్ణకే దక్కుతుంది.నాగర్జునతో సోగ్గాడే చిన్ని నాయన సినిమా చేశాడు కళ్యాణ్ కృష్ణ. ఈసినిమా 2016లో సంక్రాంతికి వచ్చి ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. నాగార్జున కెరీర్ లోనే ఆ సినిమా బిగెస్ట్ హిట్ గా నిలించింది. తరువాత నాగర్జున తనయుడు నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.అయితే సోగ్గాడే చిన్ని నాయన టైంలోనే నాగర్జునకు మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు కళ్యాణ్ కృష్ణ.
మరి నేల టిక్కెట్టు ఫ్లాప్ కావడంతో నాగ్ కళ్యాణ్ కృష్ణకు చాన్స్ ఇస్తాడో లేదో అని అనుమానం కలుగుతుంది. నాగ్ ఎక్కువగా దర్శకుల్ని నమ్ముతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నా పెద్దా ప్లాప్ దర్శకుడు సక్సెస్ దర్శకుడు అనే లెక్కలు అస్సలు వేసుకోడు. మరి లెక్కన కళ్యాణ్ కృష్ణకు నాగ్ అవకాశం ఇస్తారనడంలో ఎటువంటి అనుమానం లేదు.